జగన్‌ రెడ్డి‌వి మొత్తం హత్యా రాజకీయాలే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
జగన్‌ రెడ్డి‌వి మొత్తం హత్యా రాజకీయాలే.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదని.. భూతద్దం పెట్టి చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడలేదని.. జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే సీఎం జగన్ జగన్ పాలనలో హత్యా రాజకీయాలు నడుస్తున్నాయని, సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారని.. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు.

వైఎస్ సునీతా రెడ్డి

ఈ సమావేశంలో వైఎస్ కుమార్తె సునీత రెడ్డి మాట్లాడుతూ.. ఆడది అంటే ఒక నారి శక్తి.. మమ్మల్ని అలానే పెంచారు. తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది. వివేకా ను హత్య చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. వివేకా హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు. మేము న్యాయం కోసం పోరాటం చేస్తున్నాము. షర్మిల ను ఎంపీ గా చూడాలని వివేకా కోరిక ఈ సందర్భంగా మీరంతా షర్మిలను గెలిపించాలని కోరుకుంటున్న. షర్మిలను ఎంపీగా చూడాలని వివేకా కోరిక.. ప్రజలు భారీ మెజారిటీ‌తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీతా రెడ్డి కోరారు.

Next Story

Most Viewed